RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, నర్సాబాయి కుంట పరిసర ప్రాంతాల్లో డీసీ సమ్మయ్య ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.