ATP: పెద్దపప్పూరు మండల కేంద్రంలో మాఘమాసంలో జరిగిన తిరుణాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించిన బియ్యం, బేడల వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న స్వామివారికి సమర్పించిన బియ్యం, బేడలు, ఆలయ భూముల కౌలు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు పేర్కొన్నారు.