MNCL: బెల్లంపల్లికి చెందిన అమ్మఒడి NGO మధుకర్కు పద్మశాలి ఉగాది పురస్కారం లభించింది. హైదరాబాద్లో మాజీమంత్రి, సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర పద్మశాలి సంఘం సంయుక్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలు అందజేశాయి. మధుకర్ సేవా కార్యక్రమాలను గుర్తించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.