NDL: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపశమనం కలిగిస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. ఇవాళ బొల్లవరంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. వీరం రాములమ్మకు రూ.45,527, సుధాకర్ రెడ్డికి రూ.47,967 మంజూరు అయ్యాయి. సహాయం అందడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.