NDL: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో జరుగుతున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన గౌతమ్ రజత పతకం సాధించారు. F-41 కేటగిరీ షాట్పుట్లో ఈ విజయాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య తెలిపారు. గౌతమ్ విజయంపై జిల్లాలోని ప్రముఖులు అభినందనలు తెలిపారు.