BHNG: మోత్కూర్ మండలం దాచారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు త్వరగా అందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు శాశ్వత వసతి కల్పించడమే అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.