NLR: వింజమూరు మండలం ఏ కిస్తీపురం పంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ప్రారంభించారు. రూ. 32లక్షలతో భవన నిర్మాణం పూర్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలనాపరంగా వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. పంచాయతీ భవనం ఏర్పాటుకు 5 సెంట్ల భూమిని ఉచితంగా అందించిన లక్కు వెంకటేశ్వరరెడ్డిని ఆయన సత్కరించారు.