TG: రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో రవాణా శాఖ కీలక మార్పులు చేస్తోంది. ఇకపై లైసెన్స్ పొందాలంటే కొత్తగా ఆన్లైన్ పరీక్షను తప్పనిసరి చేయనుంది. ఈ విధానం APR 1 నుంచి అమల్లోకి రానుంది. LLRకు దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు ఆన్లైన్లో రోడ్డు భద్రతా పాఠాలు విని పరీక్ష రాయాలి. ఇందులో ఉత్తీర్ణులై సర్టిఫికెట్ నంబర్ పొందాకే LLR స్లాట్ బుక్ చేసుకోవాలి.