MDK: నార్సింగి మండలం షేర్ పల్లి గ్రామానికి చెందిన పంబల శ్యామల వైద్య చికిత్స నిమిత్తం మైనంపల్లి రోహిత్ రావు తన ఉదారతను చాటుకున్నారు. బాధితురాలి కుటుంబానికి మంజూరైన రూ. 2,50,000 ఎల్వోసీ (LOC) పత్రాన్ని ఆయన స్వయంగా అందజేశారు. శ్యామల త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తమకు అండగా నిలిచిన రోహిత్ రావుకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.