WGL: చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో 1141 మంది రైతులు సాదా బైనామా ద్వారా దరఖాస్తులు చేసుకుని నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు ఆరోపించారు. పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రతిరోజూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి భూభారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.