VSP: ఒడిశాకు చెందిన వ్యక్తి విశాఖలోని లాడ్జిలో దిగారు. ఐదుగురు వ్యక్తులు ఆయనను పరిచయం చేసుకొని మద్యం కొనుగోలు చేయించి దాడి చేశారు. అనంతరం సెల్ ఫోన్, నగదు దోచుకున్నారు. బాధితుడు ఎంవీపీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుంకరి గౌతమ్, కన్నన్ చందు, వంగర సాయిదినేశ్, నిశాంత్ రెడ్డి, జగదీశ్ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు CI చక్రధర్ రావు తెలిపారు.