GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం కానుకల హుండీల లెక్కింపు పూర్తైంది. హుండీల ద్వారా రూ.48,76,103, అన్నదాన హుండీ ద్వారా రూ.2,81,368 ఆదాయం వచ్చినట్లు ఉపకమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.