BHNG: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజాపేట మండలం బసంతాపురంలో శనివారం సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని SC కాలనీలో ఉన్న 2 బోర్లలో కొత్త మోటార్లు బిగించి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టిన సర్పంచ్కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.