SKLM: పోలాకి మండల కేంద్రంలో నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అర్చన శనివారం రాత్రి పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లిలో మార్చి 23న జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.