KNR: రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో బడ్జెట్కు వ్యతిరేకంగా ప్రతులను దహనం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన రూ.3,24,234 కోట్ల పద్దులో విద్యారంగానికి కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. విద్యారంగానికి పట్టుమని 15% కూడా నిధులు కేటాయించలేదన్నారు.