ADB: బేల మండలంలోని టాక్లి గ్రామస్తులు మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతను ఆమె నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ సర్పంచ్ అశోక్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రుపేష్ రెడ్డి ఉన్నారు.