W.G: మండల కేంద్రం అయిన ఉండి రాజులపేటలోని శ్రీ పార్వతి సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, కాలభైరవ స్వామి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇవాళ జరిగింది. ఆలయ అర్చకులు సన్నిధిరాజు కృష్ణ చలపతి శేషగిరి, సుబ్బారావు ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అఖండ అన్న సమారాధన జరిపారు.