PPM: ఇటీవల నిర్వహించిన అక్షరాంధ్రా కార్యక్రమానికి కురుపాం మండల పరిధిలోని 20 సచివాలయాల్లో 4096 మంది హాజరు కాగా, అందులో 99.6 శాతం పరీక్షలు నిర్వహించి ఫలితాల నమోదు పూర్తి చేసినట్లు స్థానిక MPDO జె. ఉమామహేశ్వరి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పెర్కొన్నారు.