KRNL: దేవనకొండ(మం) బేతపల్లిలో ఎమ్మెల్యే వీరుపాక్షి శుక్రవారం పర్యటించారు. గ్రామ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సుంకులమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.