MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం 9వ వార్డులో డ్రైనేజ్ కాలువ చెత్త చెదారంతో నిండిపోయి మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను వార్డు ప్రజలు స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో డ్రైనేజీ కాలువను శుభ్రం చేయించారు.