WNP: రేవల్లి, ఏదుల మండలాలలో నూతనంగా నిర్మించిన భవనాలలోకి తహసీల్దార్ కార్యాలయాలను తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆయా మండలాలలో ప్రారంభత్సవాలకు సిద్ధంగా ఉన్న భవనాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భవనాల నిర్మాణ నాణ్యత, సౌకర్యాలు ఆయన పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.