PLD: ఏపీలో కాంగ్రెస్ ఆఫీసులపై ఏబీవీపీ దాడులను సత్తెనపల్లి పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్ఞాన్ రాజ్ పాల్ ఖండించారు. ఆఫీసుల్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనాగరికమన్నారు. ఢిల్లీ ఏఐ సదస్సులో మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తే ఆంధ్రాలో దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.