PPM: జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగికి చెందిన మీసాల పావని అనే యువతి సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతోంది. ఆమె పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2,90,785ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంజూరు చేసింది. ఈ చెక్కును ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శుక్రవారం పావనికి అందజేశారు.