E.G: ఈ నెల 21 శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడినట్లు మండపేట మండల విద్యా శాఖాధికారి నాయుడు రామచంద్రరావు శుక్రవారం తెలిపారు. రంజాన్ పండుగ సెలవు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు. ఏప్రిల్ 2న యథావిధిగా పరీక్ష నిర్వహిస్తామన్నారు.