MBNR: శ్రీ పరాభవ నామ సంవత్సర ప్రారంభం సందర్భంగా కురుమూర్తి స్వామి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ శ్రవణానికి ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరాభవ నామ సంవత్సరం అందరికీ శుభప్రదం కావాలని ఆకాంక్షించారు.