JGL: రాయికల్ పట్టణానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పడాలతిరుపతికి “బెస్ట్ ఇండియన్ గోల్డెన్ పర్సనాలిటీ అవార్డు” లభించింది. కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలలో బోటనీ విభాగంలో పనిచేస్తున్న ఆయన, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్గా అందించిన సేవలకు గానూ ఈ గుర్తింపు దక్కింది. జాతీయ ఐక్యత, గ్రామీణాభివృద్ధిపై ఆయన చేసిన అవగాహన కార్యక్రమాలను పలువురు అభినందించారు.