MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ రేపటి నుంచి పాదయాత్ర చేబుతున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి యాత్రకు న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.