గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబసభ్యులు శనివారం రాత్రి మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠాన్ని సందర్శించారు. ఆయన ధర్మపత్ని బండ్ల జ్యోతి, తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి సహా పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులను దర్శించి ఆశీస్సులు పొందారు. మార్చి 14న జరిగే వివాహ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.