AP: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఏప్రిల్ 1న పునఃప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ పరీక్షలు రాసి రెండో ఏడాదిలోకి వచ్చిన విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్లో NCERT సిలబస్ను ప్రవేశపెట్టి, CBSE విధానాన్ని పాటిస్తున్నారు.