NRPT: మక్తల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు రకరకాల వంటలను వండి, ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమానికి మక్తల్ మున్సిపల్ ఛైర్మన్ వాకిటి హనుమంతు, వైస్ ఛైర్మన్ శైవీ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, వంటలను రుచి చూసి విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు.