సత్యసాయి: కదిరి పట్టణంలోని ఔలిల్లా మసీదులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న ఎస్పీ, వారికి స్వయంగా ఇఫ్తార్ విందు వడ్డించారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి, క్రమశిక్షణకు నిలువుటద్దమని ఆయన పేర్కొన్నారు.