MBNR: మహబూబ్నగర్ పట్టణంలోని 31వ, 32వ డివిజన్ల పరిధిలో ఉన్న ఎర్రకుంట చెరువును డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువును పునరుద్ధరించి, చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.