TG: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె గన్నేరుపప్పు దంచుకుని తిని బలవన్మరణానికి పాల్పడింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను.. స్థానికులు కరీంనగర్ ఆసుపత్రికి, ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.