VKB: బండల ఇళ్ల కారణంగా గృహలక్ష్మీ లబ్ధిదారులు అయినప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ పథకానికి అర్హత పొందలేకపోతున్నారని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి కాంక్రీట్ రూఫ్ నిర్మాణం కోసం రూ. 2 లక్షలు మంజూరు చేసేలా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ సమస్యలకు కూడా ఉపశమనం సాధించవచ్చని అన్నారు.