SRPT: నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం – శ్రీరంగాపురం మధ్య మెటల్ రోడ్డు గుంతలు పడి, ఇరువైపులా కంపచెట్లతో అధ్వానంగా మారింది. దీంతో ఆయకట్టు రైతులు, పాదాచారులు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని, మరమ్మతులు చేపట్టి, తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.