MHBD: రైతులకు సరిపడా ఎరువులను అందించాలని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. శాసనమండలిలో నేడు ఆయన మాట్లాడుతూ.. ఎరువుల బుకింగ్ కు యాప్ ద్వారా వచ్చే సమస్యను పూర్తిగా పరిష్కరించాలని, పంటలకు ధర ఏకీకృతంగా ఉండాలని అన్నారు. ఎరువుల పంపిణీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.