TG: బీఆర్ఎస్ హయాంలో ఎస్టీపీ పనులు కేవలం 30 శాతమే జరిగాయని, మిగిలిన 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయని విమర్శించారు. తాము ప్రాజెక్టులను ఆపేశామని చెప్పడం సరికాదన్నారు. మురికి కాలువగా మారిన మూసీని జీవనదిగా మారుస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు అడ్డుపడుతోందని ఆయన ప్రశ్నించారు.