KMR: పాల్వంచ మండలం ఫరీద్ పేట్లో యూరియా కొరత సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ జీడిపల్లి నర్సింహా రెడ్డి ఇటీవల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై స్పందించిన షబ్బీర్ అలీ చర్యలు తీసుకుని బుధవారం గ్రామానికి 444 బస్తాల యూరియా బస్తాలను పంపిణీ చేయించారు. రైతులు యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని వాటిని పొందవచ్చన్నారు.