MBNR: జడ్చర్ల మండలంలోని 8 కేంద్రాల్లో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,826 మంది విద్యార్థులకుగాను 1,824 మంది హాజరైనట్లు ఎంఈవో మంజులాదేవి తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి మాల్ప్రాక్టీస్కు పాల్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని, పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.