SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ధర్మాదాయ హుండీ లెక్కింపు ఫిబ్రవరి 27 న ఆలయం ప్రాంగణంలో జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాకచర్ల రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆలయం పాలకమండలి ఆలయం భక్తులు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుందన్నారు.