AKP: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ సోమవారం అనకాపల్లి వస్తున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో జరిగే పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 23న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించనున్నారు.