విశాఖ మధురవాడలో అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ 7, 8వ వార్డుల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిలో మధురవాడ జోన్లో రూ.50 కోట్ల పనులు చేపట్టామని తెలిపారు.