VZM: ఈ నెల 24 నుంచి చీపురుపల్లిలోని స్దానిక కస్పా వీధిలో వెలసిన శ్రీ సిర్లు ఎల్లమాంబ జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త అడ్డూరి రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతరకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆనవాయితీగా శ్రీ కనకమాలక్ష్మి జాతర చివర రోజున సిర్ల ఎల్లమాంబ జాతర నిర్వహిస్తారని వివరించారు.