HYD: చార్మినార్ నైట్ బజార్కు వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. ఈ భారీ రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. షాపింగ్కు వచ్చే వారు తమ నగదు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని మైకుల ద్వారా పోలీసులు నిరంతరం ప్రకటనలు చేస్తున్నారు.