NLG: చిట్యాల మున్సిపాలిటీలో వరుస బ్యాటరీల చోరీలు కలకలం రేపుతున్నాయి. చిట్యాల–భువనగిరి రోడ్డులో పార్క్ చేసిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్ బ్యాటరీతో పాటు, మరో ట్రాక్టర్ బ్యాటరీని శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆదివారం ఉదయం ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.