KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సత్య నారాయణపురంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు.