కృష్ణా: పెడన నియోజకవర్గంలో రైతులు సాగు చేసే పంట పొలాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు వేసిన పంటలను పరిశీలించి, అన్నదాత సుఖీభవ నగదు రైతుల ఖాతాల్లోకి జమ అయిందన్న విషయాన్ని రైతులకు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.