NLG: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం పట్టణానికి చెందిన పల్స రవికుమార్, పెండెం అంజనేయులకు మంజూరైన స్కూటీలను ఆయన ప్రారంభించి అందజేశారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగేందుకు, వారి ప్రయాణ కష్టాలు తీర్చేందుకు ఇలాంటి ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.