GNTR: నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం యార్డ్ ఆధునీకరణ, పెద్దాపురం వరకు 3.52 కిలోమీటర్ల మేర కొత్త పట్టాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ. 36.2 కోట్ల వ్యయంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ అడుగుతో కొత్త రైల్వే లైన్ కల సాకారం దిశగా పనులు మరింత వేగవంతం కానున్నాయి.