సత్యసాయి: పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామన్న నారా లోకేష్ హామీలు ఏమయ్యాయని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. గ్యాస్ ధరల పెంపుతో ప్రజల నెత్తిన బండ వేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ధరల భారానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గ్యాస్ సిలిండర్పై రాయితీ ఇచ్చారని గుర్తుచేశారు.